ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్లినప్పుడల్లా రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ అగ్గి రాజేస్తున్నారని వైస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
రాజధానిని తరలించాలని చూస్తే.. భూములిచ్చిన వేల మంది రైతులు చూస్తూ ఊరుకోబోరన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని రఘురామ ఆక్షేపించారు.
రాజధానిని తరలించాలని చూస్తే భూములిచ్చిన వేల మంది రైతులు చూస్తూ ఊరుకోబోరన్నారు. రాజధాని తరలించాలంటే సుమారు రూ. 90 వేల కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని అన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టే పరిస్థితులు ఉన్నాయా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వ విభాగాలన్నీ ఒకేచోట ఉండాలని ప్రజలు కోరుకుంటారని తెలిపారు. కర్నూలులో హైకోర్టు పెడితే అధికారులే వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మంత్రి బొత్స మాటలు పట్టించుకోవద్దని అమరావతి రైతులు, మహిళలకు సూచించారు.