విజయనగరం జిల్లా లో గత రాత్రి జిల్లా కేంద్రానికి వచ్చిన స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో నిజామి, గంట్యాడ మండలాల్లో పలు గ్రామ సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్ర భవనాలను మంత్రి బొత్స ప్రారంభించారు. ముందుగా జిల్లాలో జామి మండలం విజినిగిరి, గంట్యాడ మండలం కొర్లాంలో గ్రామ సచివాలయం భవనాలను మంత్రి బొత్స ప్రారంభించారు.
అలాగే కొర్లాంలో రైతు భరోసా కేంద్ర భవనాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్ ఏ. సూర్యకుమారి, ఎమ్మెల్యేలు బొత్స అప్పల నరసయ్య, కడుబండి శ్రీనివాస రావు, ఎం.ఎల్.సి. సురేష్ బాబులతో పాటు విజయనగరం ఆర్.డి.ఓ. బిహెచ్.భవానీ శంకర్, పంచాయితీ రాజ్ ఎస్.ఇ. విజయ్ కుమార్, ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.