ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కు కరోనా అటాక్ అయ్యింది. ఈ మేరకు అత్యవసరంగా ఆయన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో చేరారు.గత కొద్ది రోజులుగా ఒంట్లో నలతగా ఉన్న మంత్రి బొత్స నారాయణ కు జ్వరం కూడా రావడం తో కుటుంబ సభ్యులను కాస్త ఆందోళన లోకి నెట్టింది.
ఈ నేపథ్యంలో ఇయన ఆకస్మాత్తుగా హైదరాబాద్ పయనమయ్యారు. అత్యవసరంగా హైదరాబాద్ లోని అపోలో జాయన్ అయ్యారు. పరీక్షలు అనంతరం కరోనా ఉన్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా లో వైఎస్సార్సీపీ కి పెద్ద దిక్కు గా ఎక్కువ మంది ఎమ్మెల్యే లను గెలిపించుకున్న నేతగా పేరు గడించిన మంత్రి బొత్స…సీఎం జగన్ కు దగ్గరగా ఉంటున్నారు కూడ.
ఇక అదే విజయనగరం జిల్లా కు చెందిన మరో ఎమ్మెల్యే పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్ర స్వామి కి ఆ మధ్య కరోనా అటాక్ అయి విశాఖ అపోలో చేరి…చికిత్స తీసుకుని బయట పడ్డారు. తాజాగా అదే జిల్లా కు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ కు కరోనా అటాక్ అవడంతో పార్టీలో గుబులు మొదలైంది.