విజయనగరం జిల్లా కేంద్రంలో వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు.. గంట ఆలస్యంగా స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రారంభమైంది. జిల్లాలో వివిధ మహిళా పొదుపు సంఘాలు పెట్టిన స్టాల్స్ ను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు.
దాదాపు 20 స్టాల్స్ ను పొదుపు సంఘాలు డీఆర్డీఏ ద్వారా మహిళా సంఘాలు పచ్చళ్లు ,ఒడియాలు ,బట్టలు.. ఇత్తడి సామాన్లు ఇలా వివిధ రకాలతో పెట్టిన స్టాల్స్ ను మంత్రి బొత్స తో పాటు ఎమ్మెల్యే కోలగట్ల ,ఎంపీ బెల్లాన ,ఇతర ఎమ్మెల్యే లు పరిశీలించారు.
“జన సంక్షేమ మే జగనన్న ప్రభుత్వ లక్ష్యం” అంటూ డీఆర్డీఏ జిల్లా శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం… ఉత్సాహంగా సాగుతోంది. అంతకుముందు వేదిక కపై ఉన్న జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజాప్రతినిధులందరూ తమ తమ పాదరక్షలు విడిచి..జ్యోతి ప్రజ్వలన తో సంబరాలు ప్రారంభమయ్యాయి.