మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి మరణించారు. అనారోగ్యంతో ఆయన తల్లి ఈశ్వరమ్మ (84) విశాఖ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
సుమారు గత నెల రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. నేటి తెల్లవారు జామున ఈ విషాదం చోటు చేసుకుంది.
ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు.
విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించనున్నారు.