28.2 C
Hyderabad
May 24, 2025 09: 32 AM
Slider విజయనగరం

మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృ వియోగం

Minister Botsa Satyanarayana

మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి మరణించారు. అనారోగ్యంతో ఆయన తల్లి ఈశ్వరమ్మ (84)  విశాఖ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సుమారు గత నెల రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. నేటి తెల్లవారు జామున ఈ విషాదం చోటు చేసుకుంది.

ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య  ఎమ్మెల్యేగా ఉన్నారు.

విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించనున్నారు.

Related posts

జూపల్లి రోడ్‌షో

mamatha

పులిచింతల ముంపు బాధితులను ఆదుకుంటాం

Satyam NEWS

రేపు, ఎల్లుండి సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన

mamatha

Leave a Comment

error: Content is protected !!