తూర్పుగోదావరి జిల్లా తునిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు.
తునిలో ఏకగ్రీవమైన 15 వార్డుల కౌన్సిల్ అభ్యర్థులను మంత్రి ధర్మాన ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 వార్డులను ఏకగ్రీవంచేసిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మిగిలిన 15 వార్డులను గెలిపించి క్లీన్ స్వీప్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కలిసి పలు వార్డుల్లో ప్రచారం చేసారు.