రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా నేడు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసేందుకు తానే బైక్ పై గల్లీగల్లీకి వెళ్లిన మంత్రి వాటిని లాభితులకు అందచేశారు.
ఖమ్మం నగరంలో మంజూరైన షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను వివిధ లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి కోలాహలంగా పంపిణీ చేసిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అందరూ అభినందిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ వాకిట్లోకి తెస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని చూస్తుంటే ఆనందంగా ఉందంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తమ అభిమాన నాయకుడైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారే స్వయంగా డివిజన్ లకు విచ్చేయడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జోష్ గా.. జై పువ్వాడ.. నినాదాలతో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.