38.2 C
Hyderabad
April 25, 2024 11: 04 AM
Slider ఆధ్యాత్మికం

ఘనంగా లక్ష్మక్క పల్లె శ్రీ సీతారామ కల్యాణం

#MinisterErrabelli

జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్క పల్లె లోని శ్రీ సీతారామ ఆంజనేయ దేవస్థానంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు పాల్గొన్నారు.

మంత్రికి ఆలయ మర్యాదలతో ఆలయ పూజారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

దేవస్థాన ట్రస్ట్ చైర్మన్ పుస్కురి రాం మోహన్ రావు, అనసూయ దేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, అతి పురాతన దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరు కావడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు.

చాలా కాలంగా పస్కురి రామ్ మోహన్ రావు ఈ దేవాలయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. భక్తి, ముక్తి కి మార్గమని, దైవ సన్నిధి, భక్తి మంచి సమాజానికి దారి తీస్తుందన్నారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

తెలంగాణ గవర్నర్ కు కడపలో ఘన స్వాగతం

Satyam NEWS

కర్నూలు వచ్చి కరోనాతో సహజీవనం చేయండి

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి

Bhavani

Leave a Comment