తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం నాడు చిత్తూరు జిల్లా కాణిపాకం లోని సుప్రసిద్ధ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ప్రత్యేక పూజలు జరిపారు. తెలంగాణవాసులందరితో పాటు ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారంతా సుఖసంతోషాలతో జీవించాలని వినాయక స్వామిని మంత్రి వేడుకున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు మంత్రితో పాటు కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.