జమ్మికుంట (ఇల్లందకుంట)కు చెందిన ఒక జర్నలిస్టుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహాయం చేశారు. రిపోర్టర్ రాజేందర్ తల్లి రాధమ్మ ఇటీవల అనారోగ్యం పాలై యశోద ఆసుపత్రిలో చేరారు.
అక్కడ చికిత్స కోసం అధిక మొత్తంలో బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక చికిత్స కోసం వైద్యులను పురామయించడమే కాకుండా ఆసుపత్రి బిల్లులో 1,50,000/- మాఫీ చేయించారు.
ఆ రిపోర్టర్ ఆర్థిక పరిస్థితి తెలిసిన మంత్రి ఈటల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అదనంగా రూ.2,00,000/- ఆర్థిక సహాయం కూడా మంజూరు చేయించారు.
ఈ చెక్కును కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్యాంపు కార్యాలయంలో రిపోర్టర్ రాజేందర్ కు నేడు అందజేశారు.
జర్నలిస్ట్ కుటుంబానికి బాసటగా నిలిచిన మంత్రికి TUWJ (IJU) తరుపున జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నర్సిని శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.