కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతుపల్లి గ్రామం లో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈసారి వరి పంట సమృద్ధిగా పండిందని అన్నారు. అయితే కొంత అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి అన్నారు.
వాటిని దృష్టిలో పెట్టుకుని రంగు మారిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సూచనలు చేశారని, మిల్లులలో ఎలాంటి ధాన్యం కటింగ్ లు చేయవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.