కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల క్లస్టర్ రైతు చైతన్య వేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రైతులకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాతో చాలా రోజులుగా సంతోషం లేదని, చాలా రోజుల తరువాత సంబరం జరుపుకుంటున్నామని, రైతు వేదిక ఆ అవకాశం కల్పించిందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రమించి వందల గంటలు సమీక్ష పెట్టి తెలంగాణ కోటి రతనాల వీణ కావాలని వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టి ఫలితాలను అందిస్తున్నారని మంత్రి అన్నారు.
ఎస్ ఆర్ ఎస్ పి ఆయకట్టు చివరి భూములకు కూడా నీళ్లు అందించామని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కరెంటు కష్టాలు పారద్రోలామని, మిషన్ కాకతీయతో ఇప్పుడు నీళ్ళకు కొదవలేదని ఆయన అన్నారు.
రైతు వేదిక ఒక పవిత్రమైన జాగా ఇప్పుడు ఇక్కడ రైతును రాజును చేసే చర్చ జరగాలి అని మంత్రి తెలిపారు.