కరోనా గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. గాలి ద్వారా కరోనా సోకే ఆస్కారం లేదు. మనిషి మాట్లాడినప్పుడు తుప్పిర్ల ద్వారా సోకే అవకాశం మాత్రమే ఉంటుంది. మనిషి శుభ్రంగా ఉంటే ఎలాంటి వ్యాధి సోకదు అని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
కరోనా వస్తే ట్రీట్మెంట్ ద్వారా నయం అవుతుంది. 3 శాతం రోగులకు మాత్రమే కరోనా వ్యాధి తీవ్రత సీరియస్ గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రజలకు ఒక్కరికి కూడా కరోనా రాలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దేశాల టూర్లకు వెళ్లకుండా వాయిదా వేసుకోవాలని కోరుతున్నామని ఆయన అన్నారు.