37.2 C
Hyderabad
March 29, 2024 21: 07 PM
Slider తెలంగాణ

త్రీమెన్ వన్ ఓట్:వైరల్ గా మారిన మంత్రి ఫామిలీ వోట్

minister gangula family voting photo make sensational

ఎన్నికల అధికారులు ఇదేం రూలు ? మామూలు ఓటర్ ఐతే ఎన్నో ఆంక్షలు ?సవాలక్ష ప్రశ్నలు రూల్స్ ,రేగులే షన్లు ?ఒక్కరే లైన్ లో రావాలి ?బూత్ లో ఫోటో లు దిగకూడదు?హడల గొట్టిస్తూ అడ్డుకునే పోలీస్ లు ?కానీ ఇక్కడ ఉన్నది సూపర్ ఓటర్ ,పైగా జిల్లా మంత్రి ?ఆయనేం చేసిన అడిగే వారు లేరని ధీమా?అలాచేయకండి సర్ అందామా అంటే అయన మల్లి ఏమంటాడనే భయం అధికారులకు .

మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్లో మంత్రి గారి ఫామిలీ వోట్ చిత్రమనే ఫామిలీ కథ బాగానడిచింది,ఎంతంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేంత ..కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో వోట్ హక్కు వినియోగించుకున్న జిల్లా మంత్రి గంగుల కమలాకర్ పోలింగ్ బూత్ లో దిగిన ఫొటో నెట్టింట్లో వైరల్ అయ్యింది.తన కుటుంబం తో కలిసి అయన ఫోటో కు పొజ్ ఇచ్చిన ..అది మున్సిపల్ ఎన్నికల తీరుకు విరుద్ధమని మంత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసాడని కామెంట్లు పెడుతున్నారు.

అసలు అది పోలింగ్ బూతా లేక మరి ఇంకేమైనా నా అని ప్రశ్నిస్తున్నారు.ఒక వోట్ ను ముగ్గురు ఎలా వేస్తారని కొందరు ప్రశ్నిస్తుండగా మరి కొందరు ఎన్నికల అధికారి ఎలా భయపడుతున్నాడా చూడాలని వ్యాఖ్యానిస్తున్నారు.మొత్తానికి గంగుల ఫొటో పొజ్ వివాదమే కూర్చోగా అధికారుల పై ఎం చర్యలు తీసుకుంటారో ఎన్నికల అధికారులు చూడాలి మరి.

Related posts

దళిత మంత్రిని మోకాళ్లపై కూర్చోబెడతారా?

Satyam NEWS

స్లేవరీ:9 నెలలుగా జీతం లేక ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Satyam NEWS

గృహసారధులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment