కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందచేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. స్వయంగా మంత్రి లాభితుల ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ, షాది ముబారక్ పథకం ద్వారా ప్రతి పేద ఇంటికి కొత్త కళ వస్తున్నదని ఆయన అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 45 చెక్కులకు గాను రూ.45లక్షల విలువైన చెక్కులను ఇంటింటికి మోటార్ సైకిల్ పై ర్యాలీగా వెళ్లి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పంపిణీ చేస్తున్నారు.
previous post