27.7 C
Hyderabad
March 29, 2024 05: 00 AM
Slider ముఖ్యంశాలు

హరీషన్నకు అవమానం చేసిన టిటిడి అధికారులు

harish rao

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావును ఘోరంగా అవమానించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆయన నేడు తిరుమల విచ్చేశారు. అయితే టీటీడీ అధికారులు ఆయనకు ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదానికి తావిచ్చింది. దీనిపై మంత్రి హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాలని భావించారు.

అయితే అక్కడే ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ దామోదర్ కలగజేసుకుని సర్ది చెప్పారు. దీంతో ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పక్క రాష్ట్రం మంత్రి అయినప్పటికీ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అయితే ఇవాళ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వీఐపీలకు ఎక్కువ ఏర్పాట్లు చెయ్యలేకపోయామని, అందరూ అర్ధం చేసుకోవాలని టీటీడీ అధికారులు చెప్పారు.

Related posts

బోణాల జాతర

Satyam NEWS

విదేశీ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న బ్యాంకు మేనేజర్

Satyam NEWS

కేంద్రంపై దండెత్తిన ఆయుధం కేసిఆర్

Murali Krishna

Leave a Comment