దేశంలోని 5 రాష్ట్రాలలో కాంగ్రెస్, 12 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటింటికీ తాగునీరు, త్వరలోనే సాగునీరు, నిరుపేదలకు సంక్షేమం కింద ఆసరా ఫించన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక భృతి ఇస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎక్కడ తాగునీటి సమస్య లేదని ఆయన అన్నారు. తొలి కాన్పు తల్లిగారే చేయాలని ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి 12 వేలు, కేసీఆర్ కిట్ ఉచితంగా ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని ఆయన తెలిపారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో 315 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, 14 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతుబంధు ఇచ్చేది టీఆర్ఎస్ సర్కారు ఒక్కటేనని ఆయన అన్నారు.
పంటకు అనుకున్న విధంగా గిట్టుబాటు ధర అందించామని, త్వరలోనే ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి కాళేశ్వరం నీళ్లతో రైతు కాళ్లు కడుగుతామని ఆయన అన్నారు.