కరోనా బారిన పడిన ప్రజాబాట ఎడిటర్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ తనకు ఎంతో ఇబ్బందిగా ఉందని ఒక వీడియో పోస్టు చేయడంతో ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు వేగంగా స్పందించారు. తక్షణ సాయం అందించేందుకు ఆదేశాలు ఇచ్చారు. మెదక్ జిల్లా అంసాన్ పల్లి గ్రామానికి చెందిన సిద్దిరెడ్డి శ్రీనివాస్ తనను అపోలో ఆసుపత్రికి పంపాలని తనకు సరైన వైద్యం అందించాలని హరీష్ రావును కోరారు.
అపోలో ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో తనను చేర్చుకోవడం లేదని ఆయన వాపోయారు. దాంతో స్పందించిన హరీష్ రావు, అపోలోలో వాస్తవంగానే బెడ్ ఖాళీ లేకపోవడంతో యశోదా ఆసుపత్రికి పంపారు. అక్కడ సిద్దిరెడ్డి శ్రీనివాస్ కు తక్షణ వైద్య సాయం అందింది. రాత్రి శ్వాస పీల్చేందుకు తీవ్ర ఇబ్బంది పడిన సిద్దిరెడ్డి శ్రీనివాస్ ఇప్పుడు మెరుగుగా ఉన్నాడు. తనకు తక్షణ సాయం అందించిన మంత్రి హరీష్ రావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.