38.2 C
Hyderabad
April 25, 2024 13: 31 PM
Slider ఆదిలాబాద్

బాసర సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు

#Minister Indrakaran Reddy

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

కుటుంబ సమేతంగా బుధవారం అమ్మవారిని దర్శించుకున్న  మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

వారికి తీర్థ ప్రసాదాలతో బాటు అమ్మవారి ఆశీస్సులను అందించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై ఆలయ అధికారులతో మంత్రి చర్చించారు.

మంత్రి వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, ఈవో వినోద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Related posts

ఐఏఎస్ అధికారులపై అభిశంసన తిప్పిపంపిన జగన్ సర్కార్

Satyam NEWS

కొడుకును హత్య చేసిన కన్న తండ్రి

Satyam NEWS

ఢిల్లీలో నేటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్

Satyam NEWS

Leave a Comment