32.2 C
Hyderabad
April 20, 2024 19: 44 PM
Slider ఆదిలాబాద్

జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

#Minister Indrakaran Reddy

అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని నిర్మల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో మొక్క‌లు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్.. ట్విట‌ర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయ‌న‌ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. త‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపీ సంతోష్ కుమార్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు చేప‌ట్టిన హ‌రిత‌హారం స్ఫూర్తితో రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. పర్యావరణ మార్పుల నుంచి ఈ భూమిని రక్షించడానికి ప్రస్తుతం ఉన్న

అడవులని కాపాడుకుంటూ, మొక్కలు పెంచడం ఒక్కటే మార్గ‌మ‌ని, అందుకు కృషి చేస్తున్న సంతోష్ కుమార్ ను ఈ సంద‌ర్భంగా మంత్రి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బిగాల గ‌ణేష్, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

అక్టోబరు 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర

Satyam NEWS

ఏసీబీకి చిక్కిన రామరెడ్డి ఇంచార్జి తహసీల్దార్

Satyam NEWS

రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామికి ధన్యవాదాలు

Satyam NEWS

Leave a Comment