28.7 C
Hyderabad
April 20, 2024 04: 31 AM
Slider ఆదిలాబాద్

కొమురవెల్లి మల్లన్నకు బంగారు మీసాలు సమర్పించిన మంత్రి అల్లోల

#Komavelly Mallanna

కొమురవెల్లి మల్లన్నను  దేవదాయ శాఖ మంత్రి అల్లోల  ఇంద్రకరణ్ రెడ్డి  దంపతులు దర్శించుకున్నారు.

గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మిలకు  దేవస్థాన కార్యనిర్వహణాధికారి,  అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో  స్వాగతం పలికారు.

మంత్రి దంపతులు ఆలయంలో స్వామిని దర్శించుకుని, అభిషేక   పూజలు నిర్వహించారు. మల్లన్న స్వామి వారికి 50 గ్రాముల  బంగారు మీసాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు  వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.

Related posts

అన్నా క్యాంటిన్ల కోసం టీడీపీ నేతల వంటా వార్పు

Satyam NEWS

కోడెల చర్యలపై మండిపడుతున్న కమ్మకులస్తులు

Satyam NEWS

కార్తీక పౌర్ణ‌మి ఎమ్మెల్సీ ప్ర‌‌త్యేక పూజ‌లు

Sub Editor

Leave a Comment