నిర్మల్ రూరల్ మండలంలో ని ప్రసిద్ధి చెందిన ముజ్గి మల్లన్న పల్లకి శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసానికి చేరుకోగా మంత్రి తన నివాసంలో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి కి స్వాగతం పలికారు.
గత సంవత్సరం డిసెంబర్ లో పౌర్ణమి రోజున ప్రారంభమైన ఈ పల్లకి సేవ రెండు నెలలు పూర్తి చేసుకొని తిరిగి మాఘ పౌర్ణమిన గ్రామంలో కొలువై ఉన్న ఆలయానికి చేరుకుంటుంది.
ఈ నెల 28వ తేదీన రథోత్సవం, మార్చి 2న అగ్నిగుండ ప్రవేశంతో పాటు జాతర మహోత్సవం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు.
ఆలయ అభివృద్ధి కోసం రూ.30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.