ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ పట్టణం చైన్ గేట్ నుండి బంగల్ పెట్ వరకు రోడ్డు విస్తరణ పనులను శనివారం నాడు TRS యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్ పరిశీలించారు. నగరేశ్వర్ వాడ, కస్బా లో కాలినడకన మొత్తం తిరిగి పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్రం చైన్ గేట్ నుండి బంగల్ పెట్ వరకు రోడ్డు వెడల్పు విస్తరణ పనులను ఈరోజు ప్రారంభించమన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జౌళి నాళాకు శాశ్వత పరిష్కారం కనుగొన్నారని కరోనా వైరస్ సమయంలోను మంత్రి జౌళి నాళ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో చెప్పని పనులను కూడా నెరవేరుస్తున్నామని, మంత్రి సహకారంతో నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, కౌన్సిలర్లు అడపా పోశెట్టి, SP రాజు, గండ్రత్ రమణ, పూదరి రాజేశ్వర్,సలీం నాయకులు పతికే శ్రీను,మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.