ఎస్సారెస్పీ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దాంతో మొత్తం 20 గేట్లలో 3 గేట్లు ఎత్తారు. ఒక్కో గేట్ నుంచి 2 వేల క్యూసెక్కుల చొప్పున 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
10 నంబర్ గేట్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ స్విచ్ ఆన్ చేసి గేట్లు ఎత్తారు. 9, 10, 11 నంబర్ల గేట్లును ఎత్తి నీటిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ రాజేందర్ రావు, ఎస్సారెస్పీ జీవీసీ 4 ఎస్ఈ శివకుమార్, ఈఈ శ్రీనివాస్, నాయకులు చల్ల హరిశంకర్, నందెల్లి మహిపాల్ పాల్గొన్నారు.