32.7 C
Hyderabad
March 29, 2024 11: 34 AM
Slider జాతీయం

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

#G.Kishanreddy

ప్రపంచ ఆరోగ్య సంస్థ లో కీలక కార్య నిర్వాహక బోర్డు చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కలసి  శుభాకాంక్షలు తెలిపారు. 34 మంది సభ్యుల కార్య నిర్వాహక బోర్డు చైర్మన్‌గా భారత్‌కు అవకాశం ఇవ్వాలని గత ఏడాదే నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ నియ‌మ‌కాన్నిప్రపంచ ఆరోగ్య సంస్థ 194 స‌భ్య‌దేశాలు అంగీక‌రించాయి. హర్ష వర్ధన్ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. “కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే, బోర్డ్ చైర్మన్ గా, భారతదేశం తరపున హర్షవర్ధన్‌ ఎన్నికవ్వటం, మనందరికీ గర్వకారణం” అని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.

Related posts

అన్ని ప్రధాన పట్టణాలలో 5జి సేవలు

Bhavani

ఎస్.బి.ఐ. ఎదుట తెలంగాణ రైతు సంఘం ధర్నా

Satyam NEWS

Atrocious: ఏపీలో మరో శిరోముండనం కేసు

Satyam NEWS

Leave a Comment