అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ముందు తమకు శ్రీవారి పట్ల భక్తి ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు వారిలో ఇతర మతాల వారిని గుర్తించేది ఎలా వాని నుంచి డిక్లరేషన్ తీసుకునేది ఎలా అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.
వచ్చే వేలాది మందిని కూర్చోపెట్టి వారి మతమేతో అడగాలా అని మరి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. అసలు ఈ డిక్లరేషన్ ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఎవరిని అడిగి పెట్టారు? అంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
డిక్లరేషన్ పై చర్చ జరగాలని ఆయన ఎందుకు కోరుకున్నారో తెలియదు కానీ ప్రస్తుతం ఆయనపైనే చర్చ ప్రారంభం అయింది. మెడలో క్రాస్ వేసుకునే మంత్రి కొడాలి నానిని కూడా డిక్లరేషన్ అడగాల్సిందేననే చర్చ ప్రారంభం అయింది.
మత పరంగా హిందువుగానే ఉన్నారా? ఉంటే మెడలో క్రాస్ ఎందుకు వేసుకున్నారు అనే విషయాల జోలికి వెళ్లకుండా అన్య మతంపై నమ్మకం ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నందున కొడాలి నాని ఈ సారి తిరుపతి వస్తే డిక్లరేషన్ తీసుకుంటే కానీ ఆలయంలోకి అనుమతించరాదని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి నాని మెడలో క్రాస్ ఉన్న విషయాన్ని ఇంత కాలం ఆయన దాచిపెట్టి శ్రీవారి దర్శనం చేసుకోవడం కూడా ఆయన చేసిన తప్పేనని శ్రీవారి భక్తులు అంటున్నారు.