ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు పరిశీలించారు.
మొత్తం 1104 డబుల్ బెడ్ రూం ఇళ్లను అక్కడ నిర్మించారు. వీటితో బాటు నూతన మోడరన్ బస్టాండ్ ను త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో పనులను సమీక్షించారు.
మంత్రి తోబాటు పనులను జిల్లా కలెక్టర్ RV కర్ణన్ కూడా పరిశీలించారు. మంత్రి కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను ఆదేశించారు.