27.7 C
Hyderabad
March 29, 2024 03: 11 AM
Slider నల్గొండ

మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి

#MLA Sanampudi Saidireddy

హుజూర్ నగర్ నియోజకవర్గంలో సోమవారం జరగనున్న కేటీఆర్ పర్యటన కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేడు పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన పిదప ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోమవారం జరగనున్న కేటీఆర్ టూర్  విజయవంతం అవుతుందని, హుజూర్ నగర్ ప్రజల చిరకాల కోరిక ఆర్ డి ఓ కార్యాలయం అని,అలాంటి కలలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్ కు, యువ నాయకులు కేటీఆర్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి చూపించిన ఘనత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని, హుజూర్ నగర్ లో సోమవారం జరగనున్న KTR చేతులమీదుగా సుమారుగా 48 కోట్ల నిధులతో హుజూర్ నగర్, నేరేడుచర్ల మండలాలలో పలు అభివృధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్ట బోతున్నారు అన్నారు.

ఆర్డిఓ కార్యాలయం ప్రారంభం అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. దయచేసి కార్యకర్తలకు ఎవరికి సమావేశానికి అనుమతి లేదని, గమనించాలని కోరారు. కరోనా ప్రబలుతున్న వేళ అత్యధిక స్థాయిలో కార్యకర్తలు తరలి వస్తే ఇబ్బంది కరంగా మారుతుంది కనుక ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలని అన్నారు.

హుజూర్ నగర్  నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా,నిరుద్యోగ యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ కొరకు శిక్షణ ఇచ్చి ఐటీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు వీలుకల్పిస్తామని అన్నారు. సిఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రలో ముఖ్యంగా హుజూర్ నగర్ నియోకవర్గస్థాయిలో ఎంతగానో అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఎంపిపి గూడెపు శ్రీనివాస్ ,వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తాగి నడపడం వల్లే మర్రిమిట్ట రోడ్డు ప్రమాదం

Satyam NEWS

ఏపీ లో చో్రీ.. తెలంగాణ లో సేల్

Bhavani

తిరుపతి అసెంబ్లీ సీటుపై జనసేన ఆసక్తి: బరిలో హరిప్రసాద్

Satyam NEWS

Leave a Comment