వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో పల్లె నిద్ర అనంతరం శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
రైతులు పొలాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండంతో చెరువు అలుగు దగ్గర, వనప్రాయసం దగ్గర, గండి ఆంజనేయ స్వామి చెక్ డ్యాం దగ్గర బ్రిడ్జిల నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ. సీనియర్ విలేకరి