ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసులు నమోదు చేస్తే చాలదని ఎర్రగడలో చికిత్స చేయించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సూచించారు.
ఎన్నికల కమిషర్పై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు నానిపై కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేసించిన విషయం తెలిసిందే అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున ఐపీసీ సెక్షన్లు 504, 505, 506 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారని తెలిపారు.
అయితే తొలి నుంచి విపరీతంగా ప్రవర్తిస్తున్న ఆయన సైకోసిస్ లేదా ఉన్మాదం రుగ్మతతో బాధ పడుతున్నట్టు భావించాల్సి ఉందని చెప్పారు. ఆయన ఎక్కువగా బూతులు మట్కాడటం, వివేక రహితంగా ప్రవర్తించడమే ఇందుకు సాక్ష్యమన్నారు.
సహజంగా మానసిక రుగ్మతలు ఉన్నవారు, తాగుబోతులు, వ్యసనపరులు ఇలా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. ఇటీవల మదనపల్లెలో మూఢనమ్మకాలతో కూతుళ్లను చంపిన విద్యావంతులైన దంపతులకు విశాఖపట్నం మానసిక వైద్యశాలలో చికిత్స చేయిస్తున్న విషయం గుర్తించాలన్నారు.
కేవలం కేసులు పెట్టి శిక్షలు వేస్తే మానసిక రుగ్మతలు తగ్గవని చెప్పారు. అలాగే మానసికంగా బాగా లేని, అసాంఘీకంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి మంత్రిగా పనికిరారని తెలిపారు. కాబట్టి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొడాలి నానిని తక్షణం మంత్రివర్గం నుంచి తొలగించాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసారు.