అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లో విలేకరుల సమావేశంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహా సర్వేపల్లి ,కార్యదర్శి డివి రమణ మాట్లాడుతూ అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న బాగోతంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి బాగోతం పైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాన్ని జలగల పీల్చి పిప్పిచేస్తూ రాయలసీమ కరువు కాటకాల్లో ఉంటే అన్నమాచార్య విశ్వవిద్యాలయం మాత్రం లాభార్జన లో అగ్ర భాగాన ఉందని అన్నారు.
ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించి అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి బాగోతం విద్యార్థుల వివేధింపుల పైన ఉన్న ఉన్నత విద్యా మండలితోపాటు, సిఐడి, ఈడి, ఏసిబి సమగ్ర విచారణ జరిపి అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను గుర్తించి అన్నమాచార్య విశ్వవిద్యాలయం గుర్తింపు రద్దుచేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, వంకలు, స్మశానాలు విద్యుత్ సబ్స్టేషన్లు ఏవి కూడా వదలకుండా పూర్తిస్థాయిలో వారికి ఇష్టం వచ్చినట్టు డబ్బుంది కదా అని ప్రభుత్వ కార్యాలయంలో డబ్బులు వెదజల్లి అక్కడ ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు చేస్తున్న ఎందుకు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఈ వ్యవహారాలన్నింటి పైన సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం.
సిల్వర్ జూబ్లీ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇప్పటికే అనేక అక్రమాల రూపంలో విద్యార్థుల జోబిలకు చిల్లు వేసి వసూలు చేస్తున్నప్పటికీ సరిపోక మరో కొత్త పంతాన్ని ఎత్తుకొని డబ్బులే వసలే దయంగా అన్నమాచార్య విశ్వవిద్యాలయం ముందుందని అన్నారు. రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు మేధావులు అన్నమాచార్య విశ్వవిద్యాలయం సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనకూడదని వాళ్ళ అవినీతి ఆరోపణలు మీరు భాగస్వాములు కావద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్ పాల్గొన్నారు.