27.7 C
Hyderabad
April 26, 2024 03: 06 AM
Slider ఆధ్యాత్మికం

పైడిత‌ల్లి అమ్మ‌వారికి ప‌ట్టువస్త్రాలు స‌మ‌ర్పించిన దేవాదాయ‌శాఖ మంత్రి

#ministervellampally

విజ‌య‌న‌గ‌రం శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున ప‌ట్టువస్త్రాలు స‌మ‌ర్పించారు.. దేవ‌దాయ‌, ధ‌ర్మాదాయ‌ శాఖ‌ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్. పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రం సంద‌ర్బంగా స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌ వీర‌భ‌ద్ర‌స్వామితో పాటు మంత్రి వెల్లంప‌ల్లి, దేవాదాయ శాఖ క‌మీష‌న‌ర్ డా.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ల‌కు ఆల‌య క‌మీష‌న‌ర్ కిషోర్ వేద‌మంత్రోఛ్చార‌ణ‌ల  మ‌ధ్య మేళ తాళాల‌తో మూడు లాంత‌ర్ల నుంచీ గ‌ర్భ‌గుడిలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌ట్టువ‌స్త్రాల‌ను మంత్రి వెల్లంప‌ల్లి నెత్తిన పెట్టుకుని గ‌ర్బాల‌యంలోకి వెళ్లి స‌మ‌ర్పించారు. అనంత‌రం అక్క‌డన్న అర్చ‌కులు..అటు మంత్రి వెల్లంప‌ల్లి,కి ఇటు స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల చేత  వార వారి గోత్ర‌నామాల‌తో పూజ‌లుచేయించారు. అనంత‌రం మీడియాతో మంత్రి వెల్లంప‌ల్లి మాట్లాడుతూ…సీఎంజ‌గ‌న్  రాష్ట్రంలో అన్ని దేవాల‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోని తీసుకుని అభివృద్ది చేయిస్తున్నార‌ని…ఈ నేప‌ద్యంలో ప్ర‌భుత్వం తరుపున ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిచండం జ‌రిగింద‌న్నారు.

ఉత్స‌వ ఏర్పాట్ల‌ను స‌మ‌ర్ద‌వంతంగా మంత్రి బొత్స నేతృత్వంలో జ‌రిగాయ‌న్నారు.అధికారిక లాంచ‌నాల‌తో పైడితల్లి ద‌ర్శ‌నం జ‌ర‌గ‌డం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం నాఅదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు.మంత్రి తో పాటు విజ‌య‌న‌గ‌రం జెడ్పీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు  ఆల‌య ఉద్యోగ‌స్తులు, వైఎస్సార్సీపీ నేత‌లు  పాల్గొన్నారు.

Related posts

ఆర్మీ జవాన్ కి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూమిని మింగేశారు

Bhavani

‘ఎఫ్3’ సెకండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా’ ప్రోమో వైరల్.. క్షణాల్లో మిలియన్ వ్యూస్

Satyam NEWS

అసెంబ్లీ నుంచి చంద్రబాబునాయుడి సస్పెన్షన్

Satyam NEWS

Leave a Comment