తన వద్ద పీఆర్వోగా పనిచేస్తూ, వసూళ్ల పర్వానికి దిగిన బోనాల మల్లికార్జున్ పై మంత్రి గంగుల కమలాకర్ సీరియస్ అయ్యారు. మల్లికార్జున్ అవినీతి దందాలపై పోలీసులు యాక్షన్ తీసుకోవడంతో అతన్ని మంత్రి విధుల్లో నుంచి తొలగించారు. మంత్రి దగ్గర పీఆర్వోగా చేరి నెల రోజులు కాకముందే సెటిల్మెంట్లకు దిగడం.. ఏసీపీ, సీఐ తనకు తెలుసునని స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని వాటర్ ప్లాంట్ యజమాని దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం తెలిసిందే. ఈ విషయం సత్యం న్యూస్ వెల్లడించింది. అయితే ఆడియోలో పోలీసుల ప్రస్థావనపై వివరణ కోరారు అదనపు డీజీపీ నాగిరెడ్డి. కాగా డీసీపీ నేతృత్వంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణ విచారణకు ఆదేశించారు.