నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత ప్రజా సేవే మార్గంగా ప్రజలకు మరింత దగ్గరయ్యారని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు.
మంగళవారం బంజారాహిల్స్లోని కవిత నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి ఆమెకు పుష్ఫగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కవిత అపూరూప విజయం సాధించారంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
బతుకమ్మ పండగకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి రాష్ట్రంలోని మహిళలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని, తెలంగాణ జాగృతి సంస్థతో సాంస్కృతిక వారధిగా నిలిచారన్నారు.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలైన కల్వకుంట్ల కవిత గతంలో ఎం.పిగా సేవలు అందించిన సమయంలో ఉత్తమ పార్లమెంట్ సభ్యులుగా అవార్డు అందుకున్న వైనాన్ని మంత్రి గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమం, రాజనీతి, సామా జిక సేవా దృక్పధం, ప్రజాదరణ, కార్యశీలత వంటి అంశాల్లో ఆమె అత్యుత్తమంగా నిలిచారని కితాబిచ్చారు.