37.2 C
Hyderabad
March 29, 2024 17: 52 PM
Slider ఖమ్మం

బ్యాంక్ రుణాలను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

#ministerpuvvada

వ్యవసాయ ఆధారిత రంగాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువకులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అవేర్ సంస్థ నిర్వహించిన ఈ శిక్షణాకార్యక్రమాలలో పాల్గొన్న వ్యవసాయ నిరుద్యోగ పట్టభద్రులకు శిక్షణ అనంతరం మంజూరు చేసిన బ్యాంక్ రుణాల శాంక్షన్ ఆర్డర్ లను కూడా మంత్రి అందచేశారు.

AWARE ఆధ్వర్యంలో TTDC భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. నిరుద్యోగులు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు ఇది మంచి అవకాశమని ఆయన అన్నారు. అవేర్ సంస్థ ఫౌండర్ చైర్మన్ మాధవన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ నీరజ, జిల్లా కలెక్టర్ V.P. గౌతమ్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, SBI బ్యాంక్ ప్రతినిధులు ఉన్నారు.

Related posts

రోడ్డును ప్లాట్ చేసి అమ్ముకున్న ఘనులు

Satyam NEWS

ఆ పాదయాత్ర ఫేక్… వాళ్లంతా నకిలీ రైతులే….

Satyam NEWS

అసాధారణ విజయం సాధించిన “అరుంధతి” విడుదలై 15 ఏళ్ళు

Satyam NEWS

Leave a Comment