Slider ఖమ్మం

ఖమ్మం జిల్లాలో పోటెత్తుతున్న వరద నీరు

Minister Puvvada

ఎడతెరిపి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా  కురుస్తున్న వర్షం కారణంగా ఖమ్మం జిల్లాలోను మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలనీ మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి పువ్వాడ జిలా కలెక్టర్ RV కర్ణన్  ఇతర అధికారులు మున్నెరును సందర్శించి మున్నేరు పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల వారీగా నిండిన చెక్ డ్యాములు, చెరువులు, కుంటలు, ఇంకా వర్షాలు విస్తారంగా కురిస్తే చేపట్టిన చర్యలపై చర్చించారు. జలాశయాల పరిస్థితిని కనిపెట్టుకొని ఉండాలని, తహశీల్దార్ లు, AEE లు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళవద్దని మంత్రి ఆదేశించారు.

సహాయ చర్యలకోసం టోల్ ఫ్రీ నెంబర్ 040-23450624 ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Related posts

మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన సీబీఐ

Satyam NEWS

ఇంటిని విరాళంగా ఇచ్చేసిన ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

Satyam NEWS

కరోనా ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!