రవాణా శాఖ కార్యాచరణపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నూతన సచివాలయంలోని సమావేశ మందిరంలో శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తైన తరుణంలో
సాధించిన విజయాలు, రాష్ట్ర రవాణ శాఖ సేవలు, వనరులు, ఆదాయ వృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్తు ప్రగతి అంశాలను కార్యాచరణ ప్రణాళికను మంత్రి పువ్వాడ అజయ్ చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో
రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కే శ్రీనివాసరాజు, రవాణా శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.