జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ తెగిన గాలిపటంలా పవన్ పరిస్థితి మారిందన్నారు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితి అని అన్నారు. ఎంతో అభిమానించే మోదీ.. పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టారంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.
రౌడీయీజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతూ ఆయన ప్రవర్తన చూసి ప్రధాని దూరం పెట్టారన్నారు. ప్రజలు కూడా పవన్ గురించి ఆలోచించడమే పూర్తిగా మానేశారన్నారు. జనసేన నేత కిరణ్ రాయల్ తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే బయట పెట్టవచ్చునన్నారు. రాయల్ అనే పేరు పెట్టుకోవడం వెనుక జనసేన పార్టీ నుంచి రాజకీయ లబ్ధి పొందడం కోసమేనని మంత్రి రోజా అన్నారు.