దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ దారుణ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. హంతకులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి మంత్రి హామీ ఇచ్చారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కిరాతకుల దుర్మార్గానికి బలవడంతో శోసంద్రంలో ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులు మునిగిపోయారు. వారు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో బాటు మహబూబ్నగర్ కలెక్టర్ రొనల్డ్రోస్ ఇతర అధికారులు ఉన్నారు.