శ్రీశైల మల్లన్న సేవలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం. శంకర్ నారాయణ ఆదివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని జ్యోతిర్ముముడి సమర్పించారు. మంత్రి శివదీక్ష స్వీకరించారు.
మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు ఆహ్వానం పలికారు. అనంతరం వారికి అర్చకులు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు, స్వామి వారి శేష వస్త్రాలు అందజేశారు