రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కోట అంబరీష్ జిల్లా పరిషత్ హైస్కూల్ కు విరాళంగా ఇచ్చిన ఇంటిని నేడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా బాల్కోండ నియోజకవర్గం లోని కమ్మర్పల్లి మండలం లోని హాసకొత్తూర్ గ్రామంలో మంత్రి పర్యటించారు.
ఈ సందర్భంగా హాసకొత్తూర్ గ్రామంలో అంబరీష్ విరాళంగా ఇచ్చిన ఇంటిని పరిశీలించి స్కూలు త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.