28.7 C
Hyderabad
April 20, 2024 08: 54 AM
Slider అనంతపురం

గవిమఠంను సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్

#gavimatham

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఉరవకొండలోని శ్రీ కరిబసవేశ్వర గవిమఠాన్ని మంగళవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ ,ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసులు తదితరులు సందర్శించారు. గవి సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. గవిమఠం విశిష్టత, చరిత్ర గురించి అర్చకులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.

అంతకముందు గవిమఠం అధికారులు,అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి గవిమఠం 8 వ పీఠాధిపతులు శ్రీ జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి వారిని కలిసి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గవిమఠం సహాయ కమిషనర్ చిట్టెమ్మ,సర్పంచ్ మీనుగా లలితమ్మ,ఎంపీపీ చందా చంద్రమ్మ, జడ్పీటీసీ పార్వతమ్మ, విడపనకల్లు ఎంపీపీ కరణం పుష్పావతి, వజ్రకరూరు సర్పంచ్ మొనలిసా ఇతర నాయకులు,ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Related posts

వత్తిడి ఉంది కానీ కండువా మార్చను

Satyam NEWS

శిక్షణలో ప్రతిభ కనబర్చిన విజయనగరం పోలీసు డాగ్ హ్యాండ్లర్ జగదీష్

Satyam NEWS

వాట్ ఈజ్ దిస్: కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్

Satyam NEWS

Leave a Comment