40.2 C
Hyderabad
April 19, 2024 16: 02 PM
Slider విశాఖపట్నం

ఎంపి రఘురామకృష్ణంరాజుకు మంత్రి హెచ్చరిక

#Avanthi Srinivas

విశాఖపట్నానికి చెందిన నలందా కిషోర్ ను సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కర్నూలు తీసుకువెళ్ళడం తో మరణించారని చంద్ర బాబు నాయుడు, లోకేష్, రఘురామకృష్ణంరాజు లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు అన్నారు. రఘురామకృష్ణంరాజుకి నోటి దురుసుతనం ఎక్కువ… ఆ దురుసుతనం తోనే  అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

రఘురామకృష్ణంరాజు ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బిక్షతో  లోక్ సభలో అడుగుపెట్టిన విషయం రఘురామకృష్ణంరాజు గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు. జగన్మోహన్ రెడ్డి చరిష్మా తో మాత్రమే నాగ బాబుపై మీరు గెలుపొందారు. మీకు భిక్ష పెట్టిన సీఎం పై విమర్శలు చేయడం తగదు. వైఎస్ఆర్సిపి జెండా పై గెలిచిన మీరు టిడిపి నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు.

నర్సాపురం వరకు పరిమితంకండి. అన్ని విషయాల్లో జోక్యం కల్పించుకుంటే బావుండదు అని మంత్రి హెచ్చరించారు. విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామ కృష్ణంరాజు ఎవరు? ఇలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు నే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా ప్రజలు అడ్డుకున్నారని తెలుసుకోండి అని ఆయన అన్నారు.

Related posts

మేడే జయప్రదం చేసేందుకు కార్మికులు సిద్ధం కావాలి

Satyam NEWS

జనసేన అధినేత పవన్ సభకు రావాలన్న ఆ పార్టీ నేతలు…!

Bhavani

పుష్కర జలాలు…సకల పాప హరణం….

Satyam NEWS

Leave a Comment