31.7 C
Hyderabad
April 25, 2024 01: 22 AM
Slider ఆదిలాబాద్

భారత్ మాతాకీ జై అంటే అర్ధం తెలియని మంత్రి

#SoyamBapurao

‘భారత్ మాతాకీ జై’ అంటే అర్థమేమిటో కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తెలియదని బిజెపి పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావు అన్నారు. సాలు దొర… సెలవు దొర అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు, బండి సంజయ్ రాక పాదయాత్రతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భయపడుతున్నాడని అన్నారు. తెలంగాణలో బిజెపి ఇంత ఎదగడానికి కారకుడు బండి సంజయ్. రాబోయే రోజుల్లో బండి సంజయ్ ఆధ్వర్యంలో… తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాబోతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ మాతాకీ జై అంటే… దేశంలో ఉన్న మనుషులు, చెట్లు, జంతువులు అంతా మంచిగా ఉండాలని కోరుకోవడమే నని ఆయన అన్నారు.

దళితులను బెదిరిస్తే… ఢిల్లీకి పిలిచి, గుంజీలు తీయిస్తా అని స్థానిక సీఐకి సోయం బాపురావు హెచ్చరిక చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిపై వేటాడాలని మీకు పిలుపునిస్తున్నానని అన్నారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలను గెలిపించి, బండి సంజయ్ కి గిఫ్ట్ గా ఇస్తానని ఆయన అన్నారు.

Related posts

వైసీపీ నాయకులకు రాని కరోనా వినాయక భక్తులకు వస్తుందా?

Satyam NEWS

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు

Satyam NEWS

విద్యార్థులు చలికి వణుకుతున్నా ప్రభుత్వం అధికారులు చెలించరా

Satyam NEWS

Leave a Comment