గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 6వ డివిజన్ సింగారం గ్రామానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ దోపతి దామోదర్ రెడ్డి మృతిపట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సంతాపం వెలిబుచ్చారు. దామోదర్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నేడు ఆయన నివాసంలో జరిగిన దశ దిన కర్మ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపనేని నరేందర్ కూడా పాల్గొన్నారు.