40.2 C
Hyderabad
April 24, 2024 17: 58 PM
Slider మహబూబ్ నగర్

రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి… తొడలు కొట్టుకోవడానికి కాదు

#miryalasrinivasareddy

నాయకులు రాజకీయాలకు వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి కానీ తొడలు కొట్టుకోవడానికి కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. శనివారం విలేకరుల తో మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి  కాంగ్రెస్ పార్టీ టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై చేసిన సవాల్ ను ఖండిస్తూ మహాభారతంలో దుర్యోధనుడు తొడలు కొట్టుకుని చివరకు భీముని చేతిలో తొడలు పగల కొట్టించుకొని భూమిలో కలిసిపోయాడని మితిమీరిన ఆవేశం తో మాట్లాడరాదని హితవు పలికారు. 

ఒక మంత్రి పదవిలో ఉండి హోదా ని మరచి సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు.రేవంత్ రెడ్డి  మంత్రి నిజస్వరూపం భూ కబ్జాల పర్వం బయటపెట్టినందుకే ఆయన ఆవేశ పూర్వకంగా సవాల్ విసురుతున్నారని పేర్కొన్నారు.రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి కాదని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డి  ఆయన పదవికి రాజీనామా చేసి ఆయన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

ఎక్సప్లనేషన్: ఈ.ఓ వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు

Satyam NEWS

వాచ్ మెన్ కుటుంబానికి హోప్ ఫౌండేషన్ చేయూత

Satyam NEWS

[Natural] Male Enhancement Products Toys

Bhavani

Leave a Comment