వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గత కొన్ని రోజులుగా విడవకుండా అత్యాచారం చేస్తున్నారు.
ఇప్పుడు ఆ బాలిక మరణించింది…. ఎంత దారుణం? వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం రేపల్లె లో ఈ పైశాచిక సంఘటన జరిగింది.
ఆ 14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గత కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తుండటంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. దాంతో ఆ బాలికను హాస్పిటల్లో లో చేర్పించారు.
తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆ అమ్మాయి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందింది.
అమ్మాయి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు.