39.2 C
Hyderabad
April 23, 2024 18: 16 PM
Slider ప్రకాశం

మిరప మొక్కలు అందిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

#MLASambasivarao

ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలోని రైతుల అవసరాలకు అనుగుణంగా అధిక డిమాండ్ ఉన్న మిరప నారు ను అందిస్తున్నారు.

నారు డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నర్సరీ యాజమాన్యంతో మాట్లాడి రూ.1.20 లకు నారును  రైతుల ఇంటి ముంగిటకు చేరుస్తున్నారు.

మంగళవారం నాడు పూసపాడు లో 1.40 మొక్కలను ఎమ్మెల్యే అందజేశారు. అధికారులతో కలిసి ఆయన చేస్తున్న రైతు ప్రగతి యాత్రలో భాగంగా క్షేత్ర ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు.

ఎమ్మెల్యే ఏలూరి రైతాంగ సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాల కోసం అధికారులతో మాట్లాడారు. కాలువ మరమ్మతులు చేయకపోవడంతో నీటి సమస్య తలెత్తుతుందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో ఇరిగేషన్ డి ఈ కి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఏలూరి ఆదేశించారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ బియ్యం పంపిణి..?

Satyam NEWS

పేదల కోసం కృషి చేసిన పాపన్న

Bhavani

డబుల్ ఇళ్ల పేరుతో డ్రామాలు చేస్తున్న షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment