39.2 C
Hyderabad
March 29, 2024 15: 20 PM
Slider నెల్లూరు

కన్ఫర్మడ్: పౌరసత్వ చట్టానికి సిఎం జగన్ వ్యతిరేకం

adala prabhakar reddy

ఎన్ ఆర్ సి , ఎన్ పి ఆర్, సి ఏ ఏ ల పై నిరసన ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరు ఎంపీ ని కలిసిన జేఏసీ నాయకులకు ఆయన హామీ ఇచ్చారు. నేను ఈ అంశాలపై పార్లమెంట్లో ఓటింగ్ జరిగేటప్పుడు లేనని, హైదరాబాదులో ఉన్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 60 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలో హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా ఉన్నారని తెలిపారు. ఇదే ఐక్యత, సోదరభావం కొనసాగాలన్న దే తమ అభిమతమని స్పష్టం చేశారు.

ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ , సి ఏ ఏ లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలనే డిమాండ్ ను ఆయనకు చేర వేస్తానని స్పష్టం చేశారు. ఇదివరకే మా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దీనికి వ్యతిరేకమని తన నిర్ణయాన్ని తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ మీ కోరిక మేరకు ఆయనకు మరొక్కసారి విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు. అంతకుముందు జేఏసీ నాయకులు మౌలానా ఇలియాస్, ఆసిఫ్, జాకీర్, ఫయాజ్, జియావుల్ హక్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆపదలో ఉన్న గర్భిణీ మహిళను ఆదుకున్నమున్సిపల్ చైర్మన్

Satyam NEWS

3న రైతు దినోత్సవం

Bhavani

ఉత్సవాలు విజయవంతం

Murali Krishna

Leave a Comment