రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్యెల్యేలు ప్రజలకు మొహం చాటేస్తున్నారు. అందుకే వారు కనపడటం లేదని రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించడం లేదంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు తమ ఎమ్మెల్యే కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీసు స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్వీకరించారు.